నవతెలంగాణ – ఆర్మూర్
గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకోవలసిన చర్యల గురించి బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన శనివారం సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగిందని, ఎన్నారై పాలసీ పై ముందడుగు వేస్తున్నట్టు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డి శనివారం తెలిపారు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కన్వీనర్ గా ఈ అత్యవసర సమావేశం నిర్వహించినట్టు, ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి సూచన మేరకు అందుబాటులో ఉన్న గల్ఫ్ ప్రభావిత ప్రాంత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, నాయకులు, గల్ఫ్ వలసల నిపుణులు, అధికారులతో చర్చించడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఆది శ్రీనివాస్ తెలిపినట్టు వారు అన్నారు.. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ‘అభయ హస్తం’ ఎలక్షన్ మేనిఫెస్టోలో ‘గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల సంక్షేమం’ పేరుతో ఇచ్చిన నాలుగు హామీల అమలుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని పొన్నం ప్రభాకర్ అన్నారని తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం (చొప్పదండి), డా. మాకునూరి సంజయ్ కుమార్ (జగిత్యాల), కెఆర్ నాగరాజు (వర్ధన్నపేట), డా. ఆర్. భూపతి రెడ్డి (నిజామాబాద్ రూరల్), జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, కార్పొరేషన్ చైర్మన్లు అనిల్ ఈరవత్రి, సుంకేట అన్వేష్ రెడ్డి, , కూచాడి శ్రీహరి రావు (నిర్మల్ DCC అధ్యక్షులు ), వలస నిపుణులు అంబాసిడర్ డా. బిఎం వినోద్ కుమార్, గల్ఫ్ వలస కార్మిక నాయకులు మంద భీంరెడ్డి, సింగిరెడ్డి నరేష్ రెడ్డి, చెన్నమనేని శ్రీనివాసరావు, స్వదేశ్ పరికిపండ్ల, గల్ఫ్ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , లిజీ జోసెఫ్, వెలిశాల రాజేందర్ రావు , పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, ఎన్నారై విభాగం అధికారి ఇ. చిట్టిబాబు తదితరులు పాల్గొన్నట్టు తెలిపారు.