నవతెలంగాణ-హైదరాబాద్ : విజయవాడలో విషాదం నెలకొంది. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి చెందారు. డాక్టర్ డి. శ్రీనివాస్ ఇంటి బయట ఉరేసుకున్నాడు. ఇంటి లోపల శ్రీనివాస్ భార్య, ఇద్దరు పిల్లలు, తల్లి విగతజీవులుగా పడి ఉన్నారు. శ్రీనివాస్ ఉరేసుకోవడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. ఐదు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.