లక్నో జట్టుకు గుడ్ న్యూస్..

నవతెలంగాణ – హైదరాబాద్ : లక్నో జట్టుకు గుడ్ న్యూస్. ఆ జట్టు యంగ్ బౌలర్ మయాంక్ యాదవ్ ఫిట్నెస్ టెస్ట్ క్లియర్ చేశారు. ఈ విషయాన్ని లక్నో బౌలింగ్ కోచ్ మోర్ని మోర్కెల్ వెల్లడించారు. దీంతో ముంబైతో జరిగే మ్యాచ్లో మాయాంక్ అందుబాటులో ఉంటారని తెలిపారు. ఇంపాక్ట్ ప్లేయర్ గా అతడిని ఉపయోగించే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. 150KMPHకు పైగా వేగంతో బంతులు విసురుతూ మయాంక్ ఈ సీజన్ లో సంచలనంగా మారారు. కాగా ఇవాళ లక్నో సూపర్ జీన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య 48వ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లక్నోలోని అటల్ బీహార్ వాజ్పేయి అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది. రాత్రి 7:30 కు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్లో టాస్ కీలకం కానుంది. టాస్ గెలిచిన జట్టు కచ్చితంగా బ్యాటింగ్ తీసుకునే ఛాన్సులు ఉన్నాయి. బ్యాటింగ్ తీసుకున్న జట్టు విజయం సాధిస్తుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఇప్పటివరకు దారుణంగా ఆడుతున్న ముంబై ఇండియన్స్… ఇవాళ అయినా గెలుస్తుందా చూడాలి.

Spread the love