చెరువులో చేపల వల ఇరుక్కుని యువకుడు మృతి…

నవతెలంగాణ డిచ్ పల్లి: ఇందల్ వాయి మండల కేంద్రంలోని ఇందల్ వాయి గ్రామనికి చెందిన మైస శ్రీకాంత్(37) గ్రామంలోని పెద్ద చెరువులో చెపల వేటకు వెళ్ళి ప్రమాద వశాత్తు చెరువులోని పెద్ద కచ్చు కాలువలో మంగళవారం పడి మృతి చెందినట్టు ఎస్సై మనోజ్ కుమార్ తెలిపారు. చెరువులో చేపలు పట్టడానికీ అని ఇంటి నుండి వెళ్లి అదే చెరువులోని కాచ్చు కాలువలో కాళ్ళకు వల చుట్టు కోవడం తో నీటిలో మునిగి మృతి చెందినట్టు ఎస్సై వివరించారు. మృతుని అన్న మైస శ్రీనివాస్ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మార్చురీకి తరలించినట్లు ఎస్సై తెలిపారు.

Spread the love