ఎస్సై పై తక్షణమేచర్యలు తీసుకోవాలి

 నవతెలంగాణ భీంగల్: తన బంధువుల కేసు విషయమై భీంగల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్, బీఆర్ఎస్ పార్టీ దళిత నాయకుడు పర్సన్ నవీన్ పై చేయి చేసుకోవడంతో పాటు బూతులు తిట్టిన ఎస్సై హరిబాబు పై తక్షణమే చర్యలు తీసుకోవాలని మండల బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణ కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు పల్లికొండ కి చెందిన తన బంధువుల కేసు విషయ మై ఈనెల 18న భీంగల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన నవీన్ కేసు విషయమై ఎస్సై హరిబాబును వివరణ అడగగా కోపోద్రిక్తుడైన ఎస్సై నవీన్ పై చేయి చేసుకోవడంతో పాటు బూతులు తిట్టిన ఎస్సై పై ఫిర్యాదు చేసి మూడు రోజులు గడుస్తున్నాను. ఇప్పటికి చర్యలు తీసుకోకపోవడం సరికాదు అని అన్నారు. కనుక పై అధికారులు విచారణ చేపట్టి ఎస్సైపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నరసయ్య, నాయకులు కన్నె సురేందర్ శర్మా నాయక్, నరసయ్య, తుక్కాజీ, మండల నాయకులు ఉన్నారు.

Spread the love