మహిళ సమాఖ్యలో స్కూల్ యూనిఫారం కుట్టేవారికి శిక్షణ కార్యక్రమం

నవతెలంగాణ – జక్రాన్ పల్లి

మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయంలో స్కూల్ యూనిఫామ్ కుట్టే వారికి శిక్షణ ఇచ్చినట్టు ఏపిఎం రవీందర్ రెడ్డి మంగళవారం తెలిపారు. ప్రతి సంవత్సరం ప్రభుత్వము ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు ఏకరూప దుస్తులను అందిస్తుందని , ఏకరూప దుస్తులను కుట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు అప్పజెప్పడం జరిగిందన్నారు. మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులకు మహిళా సంఘాల సభ్యుల చేత ఏకరూప దుస్తులు కుట్టించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు. ఒక్క ఏకరూప దుస్తుకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలు ఇవ్వడం జరుగుతుందని అందరికీ తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల మహిళా సమైక్య సిబ్బంది తదితరులు ఉన్నారు.
Spread the love