డివైడర్ ని ఢీకొని యువకుని మృతి

నవతెలంగాణ గంగాధర : గంగాధర మండలం గ్రామ ఒద్యారం గ్రామ శివారులో గురువారం తెల్లవారుజామున రోడ్డు డివైడర్ ఢీకొని ఓ యువకుడు దుర్మరణం చెందాడు. స్థానిక ఎస్సై అభిలాష్ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. రామడుగు మండలం దేశరాజుపల్లి గ్రామానికి చెందిన నిమ్మనవేణి శ్రీనివాస్ (40) అనే యువకుడు గంగాధర మండలం ఒద్యారం గ్రామ శివారులో గురువారం తెల్లవారుజామున బైక్ పై వెళ్తూ డివైడర్ ను ఢీ కొట్టాడు. ఈ నెల 7వ తేదీన కరీంనగర్ మండలం ఎలగందల గ్రామంలో శుభకార్యానికి వెళ్లిన శ్రీనివాస్ తన అత్త లక్ష్మిని మరో చోట దింపడానికి వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడని ఎస్సై అభిలాష్ తెలిపారు. మృతుడు శ్రీనివాస్ భార్య మంజుల అందించిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Spread the love