చంద్రబాబుకు ఏసీబీ కోర్టు షాక్‌…

నవతెలంగాణ – అమరావతి
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టయిన ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయకుడు విజయవాడ ఏసీబీ కోర్టు షాక్‌ ఇచ్చింది. భద్రతా కారణాల నేపథ్యంలో హౌస్‌ రిమాండ్‌లో ఉంచాలని ఏసీబీ కోర్టును ఆశ్రయించగా పిటిషన్‌ను తిరస్కరించింది. చంద్రబాబు తరఫు న్యాయవాదులు చూపిన భద్రతా కారణాలను చూపుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు ఇరువర్గాల వాదనలు విన్నది. భద్రతపై చంద్రబాబు లాయర్ల వాదనతో కోర్టు ఏకీభవించని కోర్టు.. రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ముప్పులేదన్న సీఐడీ వాదనలతో ఏకీభవించింది. కోర్టు తీర్పు వ్యతిరేకంగా రావడంతో తదుపరి చర్యలపై కసరత్తు చేస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబును ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని సీఐడీ పిటిషన్‌ దాఖలు చేసింది. కస్టడీ అవసరం ఏంటో చెబుతూ పిటిషన్ దాఖలు చేయగా.. వాదనలు రేపటి వాయిదా వేసింది. కౌంటర్‌ పిటిషన్‌ను రేపు దాఖలు చేస్తామన్న చంద్రబాబు తరఫు న్యాయవాదులు తెలిపారు. ఈ మేరకు కోర్టు నిర్ణయం తీసుకున్నది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ పేపర్లను పరిశీలించేందుకు తెలుగుదేశం అధినేత తరఫున న్యాయవాదులకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఇదిలా ఉండగా.. రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న చంద్రబాబును కుటుంబ సభ్యులు ములాఖత్‌ అయ్యారు.

Spread the love