గ్రూప్-1 ఉద్యోగాలకు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ

TSPSCనవతెలంగాణ – హైదరాబాద్
రాష్ట్రంలో 563 గ్రూప్-1 ఉద్యోగాలకు నేటి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. నేటి నుంచి మార్చి 14 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. కొత్త అభ్యర్థులతో పాటు గత నోటిఫికేషన్కు దరఖాస్తు చేసుకున్నవారు కూడా మళ్లీ అప్లై చేసుకోవాల్సి ఉంటుందని టీఎస్పీఎస్సీ పేర్కొంది. గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి ఫీజు నుంచి మినహాయింపు కల్పించింది.
కాగా…గతంలో లో గ్రూప్-1 ఉద్యోగాల భర్తీ కోసం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేస్తున్నట్టు టీఎస్పీఎస్సీ అధికారికంగా ప్రకటించింది. 2022 ఏప్రిల్ లో 503 పోస్టులతో గత ప్రభుత్వం గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేసిన విషయము అందరికీ తెలిసిందే. అయితే పేపర్ లీకేజీ కారణంగా ఒకసారి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా పడితే.. మరొకసారి నిబంధనలు సరిగ్గా పాటించలేదని రెండోసారి కూడా ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేశారు.కొత్తగా 60 పోస్టులను కలిపి 563 ఉద్యోగాలకు తాజాగా నోటిఫికేషన్ ఇచ్చింది.

Spread the love