మృతిచెందిన పశువులు

– రైతును ఓదార్చిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య 
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
యాదగిరిగుట్ట మండలం కాచారం శనివారం, సీఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం దడిగ మల్లయ్య రైతుకు సంబంధించిన ఒక ఆవు, ఒక గేదె, రెండు దూడలు మృతిచెందయి. మరణించిన పశువులను వెటర్నరీ డాక్టర్ శివరామకృష్ణ ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించి, నాలుగు శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపించామని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఆ మరణించిన పశువులను ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చూసి రైతును ఓదార్చి సంఘటన ఎలా జరిగిందో ఆడిగి తెలుసుకున్నారు.
Spread the love