నవతెలంగాణ-హైదరాబాద్: మద్దెలచెర్వు సూరి హత్య కేసు నిందితుడు భానుకిరణ్కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. నాంపల్లి కోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిందేనని తీర్పునిచ్చింది. నాంపల్లి కోర్టు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను సవాల్ చేస్తూ.. భానుకిరణ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. కింది కోర్టు ఆదేశాలను సమర్థించింది. భానుకిరణ్ పిటిషన్ను కొట్టివేస్తూ.. యావజ్జీవ శిక్ష అమలుకు ఆదేశాలు జారీ చేసింది. సూరి హత్య కేసులో భానుకిరణ్ ప్రధాన నిందితుడు. 2011 జనవరి 4న హైదరాబాద్ సనత్నగర్లోని నవోదయ కాలనీలో రివాల్వర్తో సూరిని కాల్చి చంపగా.. 2018 డిసెంబర్లో అతడికి నాంపల్లి కోర్టు జీవితఖైదు విధించింది.