నిబంధనలు పాటించని సినిమా థియేటర్లపై చర్యలు తీసుకోవాలి

– ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి రాజు నాయక్

నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్ 

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రేక్షకులకు సౌకర్యాలు కల్పించకుండా వ్యవహరిస్తున్న సినిమా థియేటర్ ల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని  ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి రాజు నాయక్ డిమాండ్ చేశారు. శనివారం  హుస్నాబాద్ లోని వెంకటేశ్వర కళామందిర్  సినిమా థియేటర్లను రాజు నాయక్ రమేష్ తిరుపతి కలిసి థియేటర్లను సందర్శించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ సినిమా థియేటర్ ల యాజమాన్యాలు ప్రేక్షకుల దగ్గర అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసి కూర్చోడానికి కుర్చీలు బాత్రూంలో సరైన సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. అధికారులు థియేటర్ల పై తనిఖీలు నిర్వహించకపోవడం తో థియేటర్ యాజమాన్యాలు  ఇష్టానుసారంగా నడిపిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సెన్సార్ బోర్డ్ అధికారులు జిల్లా కలెక్టర్ ఆర్డీవో ఉన్నత స్థాయి అధికారులు తక్షణమే స్పందించి తనిఖీలు నిర్వహించి ప్రేక్షకులకు సౌకర్యాలు కల్పించాలని కోరారు లేనిపక్షంలో సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు.
Spread the love