ఉరి వేసుకొని నటి ఆత్మహత్య..!

నవతెలంగాణ-హైదరాబాద్ : భారతీయ చిత్ర పరిశ్రమలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. భోజ్‌పురి నటి అన్నపూర్ణ అలియాస్‌ అమృతా పాండే ఆత్మహత్యకు పాల్పడింది. బిహార్‌లోని జోగ్‌సర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని తన అపార్ట్‌మెంట్‌లో ఆదివారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని, దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఆత్మహత్యకు ముందు రాసిన వాట్సాప్‌ స్టేటస్‌గా పెట్టింది. ప్రస్తుతం ఈ స్టేటస్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. భోజ్‌పూర్‌ చిత్రాలతో పాటు పలు హిందీ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, టీవీషోల్లో పని చేసింది. అలాగే, పలు ప్రకటనల్లోనూ మెరిసింది. కొద్దిరోజులుగా కెరీర్‌పై ఆందోళనతో డిప్రెషన్‌లోకి వెళ్లింది. ఈ క్రమంలోనే చికిత్స పొందుతుందని కుటుంబీకులు తెలిపారు. అవకాశాలు రాకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లుగా కుటుంబీకులు పేర్కొన్నారు.

Spread the love