ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో అడ్మిషన్లు ప్రారంభం..

నవతెలంగాణ – మద్నూర్
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2024 -2025 విద్యాసంవత్సరానికి వివిధ డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైందని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చంద్రముఖర్జీ  తెలిపారు. డిగ్రీ మొదటి సంవత్సరంలో బిఏ, బీకాం, బీఎస్సీ, ఎంపీసీ, బిజెడ్సి ,కంప్యూటర్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపారు. మే  6 వ తేదీ నుంచి 25 వ తేదీ వరకు దోస్త్ ద్వారా ఆన్లైన్లో అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బిఏ అడ్మిషన్ల కొరకై 9492 795524, బీఎస్సీ అడ్మిషన్ల కొరకై 9490007424, బీకాం అడ్మిషన్ల కొరకై 9701155512, 9492795795. ఈ ఫోన్ నెంబర్లకు సంప్రదించాలని ప్రిన్సిపాల్ సూచించారు.
Spread the love