మండల సర్వసభ్య సమావేశం వాయిదా

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం గురువారం నాడు అధ్యక్షురాలు వాగ్మారే లక్ష్మీబాయి అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఎంపీటీసీ సభ్యులు గైరాజరయ్యారు. సర్వసభ్య సమావేశానికి ఎంపీటీసీల ఫోరం లేకపోవడంతో అధ్యక్షుల గారి అనుమతితో మండల సర్వేసభ్య సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు మండల అభివృద్ధి అధికారి రాని ప్రకటించారు. మండల సర్వసభ్య సమావేశానికి ఇద్దరు ఎంపిటిసిలు మాత్రమే హాజరు కావడం సరైన ఫోరం లేక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సర్వే సమావేశానికి అధికారులు మండల వ్యవసాయ అధికారి రాజు మండల విద్యాశాఖ అధికారి రాములు నాయక్ మండల పంచాయతీ అధికారి వెంకట నరసయ్య ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఏఈ గణేష్ ఐసిడిఎస్ సూపర్వైజర్ ఉపాధి హామీ ప్రోగ్రాం అధికారి పద్మ డోంగ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు ఆర్టీసీ శాఖ అధికారి తదితరులు మాత్రమే హాజరయ్యారు. ఎంపీటీసీల ఫోరం లేదు అనుకుంటే సరైన శాఖల అధికారులు కూడా పూర్తిస్థాయిలో హాజరు కాలేకపోయారు.
Spread the love