ప్రమాదాల పట్ల వెంటనే స్పందిస్తున్న ఎమ్మెల్యే

నవతెలంగాణ – మద్నూర్ 
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు  ఈరోజు నియోజకవర్గంలోని కార్యక్రమాలకు వెళ్తుండగా మార్గ మధ్యలో NH 161 ఎక్లారా గేట్ సమీపంలో మామిడికాయల లోడ్ తో వెళ్తున్న లారీ బోల్తా పడడం చూసిన ఎమ్మెల్యే  కారు ఆపి సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి, లారీ డ్రైవర్లతో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదానికి గురి అయిన లారీ బోల్తా కొట్టిన ఘటన గురించి హైవే పోలీసులకు ఎమ్మెల్యే ఫోన్ చేసి వాహనదారులకు ఇబ్బంది కలగకుండా తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు పనితీరు నియోజకవర్గ ప్రజల్లో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి ఎందుకంటే ఎలాంటి ప్రమాదాలు జరిగినా వెంటనే స్పందిస్తూ సహాయ సహకారాలు అందించడం ప్రతి ఒక్కరిలో ఇలాంటి ఎమ్మెల్యే ఎప్పుడు చూడలేదని ఎమ్మెల్యే స్పందన ప్రతి ఒక్కరికి ఆనందాన్ని కలిగిస్తున్నాయి.
Spread the love