నవతెలంగాణ – ఢిల్లీ : బీజేపీపై సమాజ్వాది పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ త్రీవ స్థాయిలో మండిపడ్డారు. బుధవారం ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి మీడియాతో ఆయన మాట్లాడుతూ… బీజేపీ చేసిన ప్రతి హామీ ఉత్తిదే అన్నారు. ఘజియాబాద్ నుంచి ఘాజీపూర్ వరకు బీజేపీ కొట్టుకుపోవడం ఖాయమన్నారు. పశ్చిమం నుంచి వీస్తున్న గాలి బీజేపీకి వ్యతిరేకంగా ఉందని అన్నారు. తొలి దశ ఎన్నికలు దేశగతిని మారుస్తాయని అన్నారు. రైతులు మోడీ ప్రభుత్వంపై తీవ్ర నిరాశలో ఉన్నారని తెలిపారు. దళితులు, మైనార్టీలు, బీసీలు, పేదలు అందరూ కలిసి ఈ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడం ఖాయమన్నారు.