ప్రయాణికులకు అలెర్ట్.. పలు రైళ్లు రద్దు.. దారి మళ్లింపు

నవతెలంగాణ హైదరాబాద్: విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి చోటుచేసుకున్న రైలు ప్రమాదం దృష్ట్యా నేడు (అక్టోబర్‌ 31) పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. ప్రధాన రైళ్లయిన హవ్‌డా-సికింద్రాబాద్‌ (12703) ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌, హవ్‌డా-బెంగళూరు (12245) దురంతో ఎక్స్‌ప్రెస్‌, షాలిమార్‌- హైదరాబాద్‌ (18045) ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లు రద్దయ్యాయి. వీటితో పాటు విశాఖ-గుణుపుర్‌, విశాఖ-రాయగడ, విశాఖ-పలాస ప్యాసింజర్‌ రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదం నేపథ్యంలో సోమవారం పలు రైళ్లను రద్దు చేయగా.. మరికొన్నింటిని దారి మళ్లించిన విషయం తెలిసిందే.

Spread the love