బీర్ల గెలుపుతోనే ఆలేరు అభివృద్ధి..

– ఉప సర్పంచ్ యనగంట్ల వీరేశం

నవతెలంగాణ_బొమ్మలరామారం 
ఆలేరు నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బీర్ల ఐలయ్యను భారీ మెజార్టీతో గెలిపిస్తే నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఉప సర్పంచ్ యనగంట్ల వీరేశం అన్నారు. సోమవారం మండలంలోని చౌదర్ పల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రచారం చేశారు..రాబోవు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అత్యధిక మెజారిటీతో గెలిపు ఖాయమని అన్నారు..రాష్ట్రంలో ప్రతి గడపకు ప్రభుత్వ సంక్షేమ ప్రయోజనాలు చేరాలనేదే కాంగ్రెస్ లక్ష్యమని తెలిపారు.రానున్న ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు చేస్తామని . ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామన్నారు. రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని కాంగ్రెస్‌ గెలి స్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు.బీఆర్‌ఎస్‌ హయాంలో అన్ని వర్గాల ప్రజలు అన్యాయానికి గురవుతున్నారని అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే రైతులు, మహిళలు అన్ని వర్గాల సంక్షేమానికి పాటు పడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం కాంగ్రెస్ నాయకులు గుర్రం శ్రీనివాస్ రెడ్డి, కళ్ళం సాయికుమార్ గౌడ్, యనగంట్లరవి, మైలారం మహేష్, నరేందర్, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Spread the love