నవతెలంగాణ – చేర్యాల: చేర్యాల పట్టణంలో సీపీఐ(ఎం) భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి కామ్రేడ్ ఎండి జహంగీర్ గారి భారీ రోడ్ షో లో పాల్గొన్నారు. అంగడి బజార్లో కార్నర్ మీటింగ్ సీపీఐ(ఎం) సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ప్రజలనుదేశించి ప్రసంగించిన సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ చుక్కా రాములు, కామ్రేడ్.ఎండి అబ్బాస్, భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి కామ్రేడ్ ఎండి జహంగీర్, జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ అందే బీరయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.