గుర్తుతెలియని వ్యక్తి ట్రైన్ కింద పడి ఆత్మహత్య

నవతెలంగాణ – కంటేశ్వర్
గుర్తుతెలియని వ్యక్తి ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని రైల్వే ఎస్సై సాయి రెడ్డి శుక్రవారం తెలిపారు. రైల్వే ఎస్సై సాయి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గురువారం రాత్రి డిచ్పల్లి నుండి నిజామాబాద్ రైల్వే స్టేషన్ మధ్యలో కిలో మీటర్ 467/8-7 వద్ద గుర్తు తెలియని హిందూ, మగ వ్యక్తి వయసు అందజా (45) నుండి (50) సంవత్సారాలు కలవు. అతను గుర్తు తెలియని ట్రైన్ క్రింద  పడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే ఎస్సై తెలిపారు. అతని కుడి చేతి పైన శంకర్ అని పచ్చ బొట్టు కలదు. కావున ఎవరైనా ఈ వ్యక్తిని గుర్తుపడితే  వెంటనే నిజామాబాద్ రైల్వే ఎస్ఐ సాయిరెడ్డిని సంప్రదించగలరు అని తెలియజేశారు. ఏదైనా సమాచారం కోసం ఈ నంబర్ను 8712658591 సంప్రదించాలన్నారు .
Spread the love