సీఎం రేవంత్ ను కలిసిన రాష్ట్ర జిల్లా ట్రస్మా ప్రతినిధులు 

నవతెలంగాణ – కంటేశ్వర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని రాష్ట్ర జిల్లా ట్రస్మా ప్రతినిధులు నూతనంగా ఎన్నికైన రాష్ట్ర కమిటీ సభ్యులు అలాగే నిజామాబాద్ జిల్లా సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యలపై, అదేవిధంగా బడ్జెట్ విషయమై వినతిపత్రాన్ని అందజేయగా, సానుకూలంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నూతనంగా ఎన్నికైన కమిటీ బాధ్యులతోపాటు నిజామాబాద్ జిల్లా నుండి జిల్లా అధ్యక్షులు జయసింహ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love