నవతెలంగాణ – హైదరాబాద్: పేటీఎంకు మరో బిగ్ షాక్ తగిలింది. ఫాస్టాగ్ జారీ నిలిపివేస్తూ ఉత్తర్వులను ఐహెచ్ఎంసీఎల్ జారీ చేసింది. ఫాస్టాగ్ జాబితా నుంచి పేటీఎంను ఐహెచ్ఎంసీఎల్ తొలగించింది. టాప్ అప్స్, డిపాజిట్లు స్వీకరించొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఐహెచ్ఎంసీఎల్ పేర్కొన్న జాబితాలో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎస్బీఐ, యెస్ బ్యాంక్ సహా మొత్తం 32 బ్యాంకులు ఉన్నాయి. దాంట్లో పీపీబీఎల్ మాత్రం లేదు. ఫిబ్రవరి 29 తర్వాత వినియోగదారుల ఖాతాలు, వ్యాలెట్లు, ఫాస్టాగ్లలో డిపాజిట్లు, టాప్-అప్లు స్వీకరించొద్దని పీపీబీఎల్ను ఆర్బీఐ ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, ఆయా ఖాతాల్లో ఇప్పటి వరకు ఉన్న సొమ్మును మాత్రం అది అయిపోయేంత వరకు ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేసింది. ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలోనే ఐహెచ్ఎంసీఎల్ తాజా మార్పులు చేసినట్లు తెలుస్తోంది.