ఎన్నికల వేళ సీఎం రేవంత్‌ రెడ్డిపై ఏపీ సీఎం జగన్‌ సంచలన కామెంట్స్

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై ఏపీ సీఎం వైఎస్ జగన్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కడపలోని పొట్టి శ్రీరాములు సర్కిల్ వద్ద నిర్వహించిన వైసీపీ ఎన్నికల సభలో సీఎం జగన్ ప్రసంగించారు. చంద్రబాబును గెలిపించేందుకు ఏపీలో కాంగ్రెస్‌ రంగప్రవేశం చేసిందని మండిపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చంద్రబాబు మనిషి అని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి అని, చంద్రబాబు పగలు బీజేపీతో కాపురం చేస్తారు, రాత్రి కాంగ్రెస్ తో కాపురం చేస్తారు.. అంటూ జగన్ ప్రసంగించారు. ఎన్నికల వేళ ఏపీ సీఎం జగన్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై సంచలన కామెంట్స్ చేయడం పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇదిలా ఉంటే చంద్రబాబు గురించి సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన సమాధానం ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చంద్ర‌బాబు నాయుడు తనకు గురువు కాదని, నేను స‌హ‌చ‌రుడిని మాత్ర‌మే అని రేవంత్ చెప్పిన విషయం తెలిసిందే.

Spread the love