తెలంగాణకు క్లస్టర్‌ ఇన్‌ఛార్జ్‌లు, పరిశీలకుల నియామకం..

– ఏఐసీసీ ఆదేశాలు
న్యూఢిల్లీ: తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం క్లస్టర్‌ ఇన్‌ఛార్జ్‌లు, అసెంబ్లీ నియోజకవర్గాల పరిశీలకులను కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రకటించింది. ఈ మేరకు పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) చేసిన ప్రతిపాదనలకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదం తెలిపారు. 10 మంది క్లస్టర్‌ ఇన్‌ఛార్జ్‌లు, 48 మంది నియోజకవర్గాల పరిశీలకుల నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదేశాలు జారీ చేశారు.

Spread the love