అరెస్టులతో అడ్డుకోలేరు

– వెంటనే విడుదల చేయాలి: రేవంత్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అక్రమ అరెస్టులతో కాంగ్రెస్‌ నాయకులను అడ్డుకోలే రని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి తెలిపారు. వంరగల్‌ కాంగ్రెస్‌ నాయకుల అక్రమ అరెస్టుల పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం హైదరాబాద్‌ గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఇటీవల భారీ వర్షాలకు, వరదలకు నగరం తీవ్రంగా దెబ్బతిన్నా… ఒక్క పైసా నష్టపరిహారం గాని, నష్ట నివారణ కార్యక్రమాలు గాని చేపట్టలేదని తెలిపారు. అందుకు నిరసనగా గ్రేటర్‌ వరంగల్‌ కార్యాలయం వద్ద నిరసన తెలిపిన కాంగ్రెస్‌ నాయకులను గృహ నిర్బంధాలు చేసి, అక్రమ అరెస్టులు చేశారని తీవ్రంగా ఖండించారు. నాయకులతో కార్పొరేషన్‌ అధికారులు మాట్లాడాలని డిమాండ్‌ చేశారు. ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

Spread the love