దారుణం.. ఆడ శిశువును సజీవంగా పూడ్చిపెట్టారు

నవతెలంగాణ-హైదరాబాద్ : హనుమకొండ జిల్లా దామెర మండలం ఉరుగొండ వద్ద దారుణం చోటు చేసుకుంది. ఆడ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు సజీవంగా పూడ్చిపెట్టారు. మట్టి తొలగించి ఆడ శిశువను స్థానికులు బయటకు తీశారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆడశిశువును పోలీసులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love