రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మెన్‌గా బక్కి వెంకటయ్య

– రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ నూతన చైర్మెన్‌గా బక్కి వెంకటయ్యను సభ్యులుగా కుస్రం నీలాదేవి, రాంబాబు నాయక్‌, కొంకటి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్‌, రేణికుంట ప్రవీణ్‌లను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈమేరకు గురువారం నియమించారు. సీఎం కేసీఆర్‌ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది.

Spread the love