నవతెలంగాణ-వీణవంక
మండలం లోని బొంతుపల్లి యాధవ సంఘం కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బావు సంపత్, ఉపాద్యక్షుడిగా ముషిక ఎల్లయ్య, కార్యదర్శిగా బావు రాజు, డైరెక్టర్లగా మండల శ్రీనివాస్, సింగారపు రవి, బావు అయిలమ్మ, చెనవేన సరోజన ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అదికారులుగా నిర్మలా రెడ్డి, కావ్య వ్యవహరించారు. ఈ సందర్భంగా సంపత్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో రెండోసారి తనను అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు యాదవ కులస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సంఘం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చదువు లక్ష్మి మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.