బీటీ రోడ్డు నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి

– కాంగ్రెస్ పార్టీ జిల్లాధికార ప్రతినిధి రాజశేఖర్ రెడ్డి
నవతెలంగాణ-బెజ్జంకి
రానున్న వర్షాకాలం దృష్ట్యా ప్రయాణీకులకు ఇబ్బందులు తలెత్తకుండా మండలంలో ప్రారంభించిన బీటీ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ వహించి త్వరితగతిన పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లాధికార ప్రతినిధి పోతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గురువారం విజ్ఞప్తి చేశారు.మండల కేంద్రం నుండి బేగంపేట గ్రామ వేళ్లు రోడ్డుపై కంకరతో రాత్రి వేళల్లో ప్రయాణీకులు ప్రమాదాల బారిన పడుతున్నారని త్వరితగతిన బీటీ రోడ్డు పనులు పూర్తిచేయాలని రాజశేఖర్ రెడ్డి ప్రజాప్రతినిధులను కోరారు.

Spread the love