గంగాగౌడ్ కుటుంబాన్ని పరామర్శించిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

నవతెలంగాణ రెంజల్: రెంజల్ మండల కేంద్రంలో ని గంగా గౌడ్ కుటుంబ సభ్యులను బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి బుధవారం పరామర్శించారు. ఇటీవల గంగా గౌడ్ కోడలు మృతి చెందగా, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు తమ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుంది అని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఆయన వెంట మాజీ జెడ్పిటిసి నాగభూషణం రెడ్డి. తాజా మాజీ సర్పంచ్ రమేష్ కుమార్, సాయిబాబా గౌడ్, అంతి రడ్డి రాజిరెడ్డి, ఎడపల్లి మండల అధ్యక్షులు పులి శ్రీనివాస్, రామ్మోహన్ వు, శ్రీనివాస్ గౌడ్, మహిపాల్ రెడ్డి, ఓబీసీ మండలాధ్యక్షుడు లచ్చే వార్ నితిన్, రవి, కిరణ్, ఎమ్మెల్యే రాజు, హైమద్ చౌదరి, సాయ గౌడ్, రాకేష్, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.

Spread the love