బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకోవాలి..

నవతెలంగాణ – డిచ్ పల్లి
రాజకీయ పార్టీలు నాయకులు ఏజెంట్లను నియమించుకోవాలని ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు అధికారులకు సహకరించాలని నిజామాబాద్ ఆర్డిఓ రవి అన్నారు శనివారం డిచ్పల్లి మండల కేంద్రంలోని ఘన్పూర్ లోని తాసిల్దార్ కార్యాలయం వద్ద నిజామాబాద్ రూరల్ నియోజక వర్గం స్థాయి పొలిటికల్ పార్టీల ప్రతినిధులు, తహశీల్దార్లు, సూపర్వైజర్ ఆఫీసర్ల తో శనివారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు ఏ సందర్భంగా ఆర్డీవో రవి మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా బిఎల్ఓ లు నీర్వహించిన ఓటర్ లిస్ట్ పై ఇంటింటికి సర్వే నిర్వహించామని ఈ సర్వే శుక్రవారం తో ముగిసిందన్నారు. ప్రతి రాజకీయ పార్టీ వారి వారి బూత్ లెవెల్ ఏజెంట్ ల నియామకం అవశ్యకత వివరించారు. ఓటర్ లిస్ట్ను తయారు చేయుటకు అధికారులకు సహకరించలని కోరారు. ఈ సమావేశంలో నిజామాబాద్ రూరల్ లోని ఆయా మండలాలకు చెందిన తహసిల్దారులు మండల రెవెన్యూ అధికారులు, బిఎల్ఓలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love