కార్పొరేషన్ చైర్మన్ ను కలిసిన బ్రాహ్మణ సంక్షేమ సంఘం

నవతెలంగాణ – కంటేశ్వర్
తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంగం ఇందూరు అధ్యక్షులు భూపతి రావు అధ్యక్షులు కిరణ్ దేశ్ ముఖ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని బొగ్గుల కుంటలో తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కార్యాలయంలో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రమణాచారిని మర్యాద పూర్వకముగా బుధవారం కలిశారు. ఈ సందర్భంగా ఈ నెల 31వ తారీకున హైదరాబాద్ లో మన ప్రియతమా ముఖ్యమంత్రి కేసిఆర్ చేతుల మీదుగా బ్రాహ్మణ భవనం సధనం ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది అని తెలియజేస్తూ ఈ కార్యక్రమనికి పెద్ద ఎత్తున బ్రాహ్మణ బంధువులు రావాలని రమణాచారి సూచించారాని తెలియజేస్తూ అధ్యక్షులు భూపతి రావు అధ్యక్షులు కిరణ్ దేశ్ ముఖ్ మాట్లాడుతూ నిజామాబాదులో బ్రాహ్మణ భవనానికి నిధులు కేటాయించాలని అర్హులైన పేద బ్రాహ్మణులకు బెస్ట్ స్కెమ్ క్రింద ఆర్థిక సహాయం చేయాలనీకేచారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈనెల 31తారీకున నిజామాబాదు జిల్లా నుండి బ్రాహ్మణ బంధువులు హైదరాబాద్ లో బ్రాహ్మణ భవన ప్రారంభోత్సవనికి బ్రాహ్మణ బంధువులు పెద్ద ఎత్తునా రావాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంగం ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్, రొట్టె సభ్యులు ప్రకాష్ కులకర్ణి, లక్ష్మి నారాయణ, భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love