బీఆర్ఎస్ అభ్యర్థి కవితను భారీ మెజార్టీతో గెలిపించాలి 

– లకావత్ నరసింహ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు
నవతెలంగాణ – గోవిందరావుపేట
పార్లమెంట్ ఎన్నికల్లో బి.ఆర్.ఎస్ అభ్యర్థి మాలోతు కవితను భారీ మెజారిటీతో గెలిపించాలని బి.ఆర్.ఎస్ మండల అధ్యక్షుడు లాకావత్ నరసింహ పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని పసర గ్రామంలో ఎంపీపీ సూడి శ్రీనివాసరెడ్డి నివాస గృహం వద్ద బి ఆర్ ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్లమెంటు ఎన్నికల సమన్వయ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ బి ఆర్ఎస్ పార్టీ మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత ని మండలం నుండి భారీ మెజార్టీ ఇవ్వాల్సిందిగా బి ఆర్ఎస్ పార్టీ నాయకులకు  పిలుపునిచ్చారు. అదే విధంగా రేపు మాజీ  ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు  ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబాబాద్ వస్తున్న సందర్భంగా మన  మండలం నుండి బి ఆర్ఎస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో వెళ్లాలని ఆ ర్యాలీని విజయవంతం చేయాలని నాయకులకు విజ్ఞప్తి చేశారు. గోవిందరావుపేట పార్లమెంటు సమన్వయ కమిటీ మండల సభ్యులు సూడి శ్రీనివాస్ రెడ్డి గోవిందరావుపేట ఎంపీపీ తుమ్మల హరిబాబు గోవిందరావుపేట జడ్పిటిసి లకావత్ నరసింహ నాయక్ మండల అధ్యక్షులు పిన్నింటి మధుసూదన్ రెడ్డి,బుర్ర సురేందర్,స్వప్న లక్ష్మణ్ రెడ్డి,ఆలూరి శ్రీనివాస్ రావు, లావుడియా రామచందర్,వెలిశాల స్వరూప, లకావత్ చందూలాల్, దేవా నాయక్,ఈసం సమ్మయ్య జీ నర్సిరెడ్డి,సూరనేని శ్రీనివాసరావు,తలసిల ప్రసాద్
రుద్ర బోయిన మల్లేష్,అజ్మీర సురేష్,ఎండి పక్రుద్దీన్, సిహెచ్ ఐలోని,బొల్లం ప్రసాద్,భూ రెడ్డి మధు లను ఎన్నుకున్నారు.
Spread the love