ఐదుగురు పోలీసు అధికారులకు కేంద్ర హౌంశాఖ పతకాలు

నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
కేంద్ర హౌంశాఖమంత్రి పరిశోధనా ప్రతిభ పతకాలు 2023 సంవత్సరానికి గాను రాష్ట్రం నుంచి ఐదుగురు పోలీసులు అధికారులు ఎంపికయ్యారు. నేర పరిశోధనలో అత్యున్నతమైన వృత్తిపరమైన ప్రమాణాలను ప్రోత్సహించడం, పరిశోధనలో చూపిన ప్రతిభను గుర్తించేందుకుగానూ కేంద్ర హౌం శాఖ ఈ పతకాలను 2018లో ప్రవేశపెట్టింది. ప్రతి ఏటా ఆగస్టు 12న ప్రకటిస్తారు. వివిధ రాష్ట్రాల్లోని పోలీసు అధికారులతో పాటు సీబీఐ, ఎస్‌ఐఏతో కలిపి 140 మందికి పతకాలు ప్రకటించారు. ఈ ఏడాదికి తెలంగాణ నుంచి మూల జితేందర్‌ రెడ్డి (అసిస్టెంట్‌ సీపీ), భూపతి శ్రీనివాసరావు (అసిస్టెంట్‌ సీపీ), మేకల తిరుపతన్న (అదనపు ఎస్పీ), రాజుల సత్యనారాయణ రాజు (డిప్యూటీ ఎస్పీ, కమ్మాయిపల్లె మల్లికార్జున కిరణ్‌ కుమార్‌ (డిప్యూటీ ఎస్పీ)లు ఎంపికయ్యారు.

Spread the love