అలిపిరి నడకదారిలో చిరుతలు, ఎలుగుబంట్లు

నవతెలంగాణ – తిరుమల: అలిపిరి-తిరుమల నడక మార్గంలో చిరుతలు, ఎలుగుబంట్ల సంచారం కొనసాగుతోంది. టీటీడీ అటవీశాఖ ఏర్పాటు చేసిన ట్రాప్‌ సీసీ కెమెరాల్లో వీటి సంచారం రికార్డయింది. నడక మార్గంలో ఏడో మైలు వద్ద పెట్టిన కెమెరాల్లో శుక్రవారం, శనివారం అర్ధరాత్రి ఓ ఎలుగుబంటి, రెండు చిరుతలు కనిపించాయి. ఆదివారం సాయంత్రం నరసింహస్వామి ఆలయం సమీపంలోనూ ఎలుగుబంటి సంచారం గుర్తించారు. ఎప్పటికప్పుడు జంతువుల సంచారాన్ని గుర్తిస్తున్నామని, ఆ మేరకు నడకదారిలో భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ అటవీశాఖ డీఎఫ్‌వో శ్రీనివాసులు తెలిపారు.

Spread the love