కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు: చెరుకు శ్రీనివాస్ రెడ్డి

నవతెలంగాణ – తొగుట
కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు  కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం ప్రెస్ నాట్ ద్వారా తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోసం దుబ్బాక నియోజక వర్గ నాయకులు,  కార్యకర్తల కృషి మరువలేనిద న్నారు. మెదక్ లో బహుజన బిడ్డ నీలం మధు ముదిరాజ్ ఎంపీగా ఘనవిజయం సాధించడం ఖాయం అని అభిప్రాయం వ్యక్తం చేశారు. గత నెల రోజుల నుండి పార్టీ కోసం, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మెదక్ అభ్యర్థి నీలం మధు గెలుపు కోసం ప్రతి సెకెండ్ ప్రజలో మమేకం అవుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు మన ప్రజా పాలనను వివరిస్తూ గెలుపు లక్యంగా కృషి చేసిన మీకు ఎల్లపుడూ అందుబాటులో ఉంటామన్నారు.
Spread the love