చేతన ఫౌండేషన్ సేవలు మరువలేనివి

– ములుగు ఎమ్మెల్యే సీతక్క
కొత్తూరు గ్రామంలోని వరద బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ
నవతెలంగాణ -తాడ్వాయి
విస్తారంగా వర్షాలు కురిసి వరద ప్రవాహంలో పూర్తిగా అన్ని కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉన్న కొత్తూరు గ్రామ ప్రజలకు నిత్యవసర సరుకులు అందించిన చేతన ఫౌండేషన్ దాతల సహకారం మరువలేనిదని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ఆదివారం మండలంలోని ఊరటం గ్రామపంచాయతీ పరిధిలో గల కొత్తూరు గ్రామంలో వరద బాధితులకు చేతన ఫౌండేషన్ దాతల సహకారంతో నిత్యవసర సరుకులను అందించారు. ఈ సందర్భంగా ములుగు ఎమ్మెల్యే సీతక్క, చేతన ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరికి అండగా నిలబడి నష్టం జరిగిన ప్రతి ఒక్కరికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, జిల్లా యూత్ అధ్యక్షులు బానోత్ రవిచందర్, మండల అధ్యక్షులు బొల్లు దేవేందర్, గౌరవ అధ్యక్షులు జాలపు అనంతరెడ్డి, తాడ్వాయి సర్పంచ్ ఇర్ప సునీల్ దొర, డైరెక్టర్ యానాల సిద్ది రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు వావిలాల రాంబాబు, నాయకులు పాక రాజేందర్, కోటే నరసింహులు, సీతక్క యువసేన జిల్లా అధ్యక్షులు చర్పరవీందర్, సోషల్ మీడియా ఇన్ఛార్జి గజ్జల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love