దళిత బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్

నవతెలంగాణ- మిరు దొడ్డి : దళిత బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని మాజీ ఎమ్మెల్సీ పారు హుస్సేన్ , కొత్త ప్రభాకర్ రెడ్డి తనయుడు పృథ్వి రెడ్డి లు అన్నారు. సోమవారం మిరుదొడ్డి మండలం లింగుపల్లి, మల్లుపల్లి  గ్రామంలో దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి నీ అధిక మెజార్టీతో గెలిపించాలని ఉద్దేశంతో గ్రామంలో ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లింగుపల్లి గ్రామం దళిత గ్రామం కాబట్టి తప్పనిసరిగా ప్రభాకర్ రెడ్డి గెలిచిన వెంటనే ప్రతి ఇంటింటికి దళిత బంధు అందిస్తామని  అన్నారు. ప్రభాకర్ రెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించుకొని గ్రామాన్ని మరింత అభివృద్ధి విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్  బాల్ నర్సింలు, బీఆర్‌ఎస్‌ నాయకులు కమలాకర్ రెడ్డి, చార్వాక కుమార్, లింగుపల్లి యువకులు భాను అమర్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love