నవతెలంగాణ-బెజ్జంకి
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు మండలంలోని ఆయా గ్రామాల బీఆర్ఎస్ శ్రేణులు సోమవారం భారీగా తరలివేళ్లారు. ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగంతో మండలంలోని బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్తజం వెల్లివిరిసిందని పలువురు బీఆర్ఎస్ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు.