నిజామాబాద్ నగర అభివృద్ధి పై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి

– 1000 కోట్లతో నిజామాబాద్ నగరం అభివృద్ధి
– పరుగులు పెడుతున్న ప్రగతి
– శర వేగంగా సుందరికరణ పనులు
– మౌళిక సదుపాయలకు పెద్ద పీట
– చివరి మజిలి గౌరవంగా సాగనంపేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వైకుంఠ దామలు నిర్మాణం
– నిజామాబాద్ నగరం లో హైదరాబాద్ తరహా 4 వైకుంఠ దామలు నిర్మాణం
– ఎమ్మెల్యే గణేష్ బిగాల పర్యవేక్షణలో ప్రముఖ అర్చిటెక్ ల అధునాతన డిజైన్లతో పచ్చదనం విరజిల్లెల ఆధునిక సదుపాయాలతో వైకుంఠ దామలు నిర్మాణం
– ప్రారంభానికి సిద్ధంగా ఉన్న అర్సపల్లి వైకుంఠ ధామం
– త్వరలో ప్రారంభించనున్న మంత్రి వర్యులు కేటీఆర్
– పరిశీలించిన ఎమ్మెల్యే గణేష్ బిగాల
నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల అర్సపల్లి లో ఆధునిక సదుపాయాలతో నిర్మిస్తున్న వైకుంఠ దామాన్ని ఆదివారం పరిశీలించారు.ఇది వరకే 15వ డివిజన్ అర్సపల్లి ని దత్తత తీసుకున్న ఎమ్మెల్యే గణేష్ బిగాల గారు ప్రత్యేక నిధులతో సామాజిక భవనాలు,రోడ్లు,డ్రైనేజిలను నిర్మించారు.మంచి నీటి ట్యాంకు లు,పీడర్ లైన్లు వేసి ప్రతి ఇంటికి సురక్షిత నీరు అందిస్తున్నారు.చివరి మజిలీకి ఘనంగా వీడ్కోలు పలికేందుకు ప్రత్యేక డిజైన్ లతో వైకుంఠ దామాన్ని నిర్మిస్తున్నారు. స్మశాన వాటిక అనే అనుభూతి కలగకుండా పచ్చని చెట్లతో ,అందమైన లైట్లతో హైదరాబాద్ తరహా సదుపాయాలతో నిర్మిస్తుండటం తో ఆ ప్రాంత ప్రజలు ఆశర్యం వ్యక్తం చేస్తున్నారు.త్వరలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ వైకుంఠ దామాన్ని ప్రారంభిస్తారు అని తెలియజేశారు.

Spread the love