యువ రచయిత రమేష్ కార్తీక్ నాయక్ ను అభినందించిన సీఎం రేవంత్

నవతెలంగాణ – హైదరాబాద్: యువకవి, రచయిత రమేష్ కార్తీక్ నాయక్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ 2024 యువ పురస్కారం వచ్చింది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పెషల్ ట్వీట్ చేశారు. అతిపిన్న వయసులో తన రచన ‘ఢవ్లో’కు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం దక్కించుకున్న నిజామాబాద్ జిల్లా రమేష్ కార్తీక్ నాయక్‌కు అభినందనలు తెలుపుతున్నా అన్నారు. ఈ అవార్డు గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలకే కాదు, తెలంగాణ రాష్ట్రానికి దక్కిన గొప్ప గౌరవం అని తెలిపారు.  భవిష్యత్తులో కార్తీక్ మరిన్ని మంచి రచనలు చేయాలని.. సాహిత్య రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సీఎం రేవంత్  ఆకాంక్షించారు.

Spread the love