మంత్రి గంగుల, గజ్జల కాంతం పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

నవతెలంగాణ- జమ్మికుంట: జమ్మికుంట పోలీస్ స్టేషన్లో తెలంగాణ రాష్ట్ర ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జలకాంతం, రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్  పై తెలంగాణ మైనార్టీ ఫోరం ఆధ్వర్యంలో మంగళవారం జమ్మికుంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగాతెలంగాణ బిసి సంక్షేమ సమితి మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి షేక్ సాబీర్ అలీ మాట్లాడారు. ఈనెల 4న తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన, తెలంగాణ ప్రజా ఆశీర్వాద సభలో జెఎసి చైర్మన్ గజ్జలకాంతం మాట్లాడుతూ  గంగుల కమలాకర్ అట్టి సమావేశానికి ఆహ్వానించడానికి మంత్రి వద్దకు వెళ్ళినప్పుడు, తెలంగాణ లో ఉన్న తురక ముండ కొడుకులను ఎందుకు నీ వెంట ఏసుకు తిరుగుతున్నవు అని  ముస్లిం మైనార్టీలను అవమానపరిచారని, గజ్జల కాంతం  మీటింగ్లో బహిరంగంగా చెప్పడం జరిగిందని తెలిపారు అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లిం మైనార్టీలను ముండా కొడుకులుగా పేర్కొన్నా విషయమై పూర్తి వీడియో, ఆధారాలతో సంబంధిత పోలీసు పోలీస్ స్టేషన్లో గజ్జల కాంతం  గంగుల కమలాకర్ లపై ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. సంబంధిత ఫిర్యాదు విషయమై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తూ, బాధ్యులపైన శాఖపరమైన చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. తెలంగాణ ముస్లిం మైనారిటీలకు ఈ విషయంలో న్యాయం జరగనియెడల, రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేయటంతో పాటు రాష్ట్ర హైకోర్టు లో కేసు నమోదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బిసి సంక్షేమ సమితి మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి షేక్ సాబీర్ అలీ, తెలంగాణ మైనారిటీ ఫోరం సభ్యులు మొహమ్మద్ గయాస్ ఖాన్, తెలంగాణ బిసి సంక్షేమ సమితి హుజురాబాద్ డివిజన్ ఉపాధ్యక్షుడు మహమ్మద్ యాకూబ్ , న్యాయవాది కొత్తూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love