ఫిర్యాదులను నిర్దేశించిన సమయం లోపల పరిష్కరించాలి

– కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌ మమత
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను నిర్ధేశించిన సమయం లోపల పరిష్కరించాలని కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌ మమత వార్డు అధికారులను ఆదేశించారు. గురు వారం మూసాపేట, కూకట్‌ పల్లి సర్కిళ్ళ వార్డు కార్పొరేట ర్లకు, వారి వార్డుకు సంబంధించిన వార్డు అధికారులతో పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జో నల్‌ కమిషనర్‌ మాట్లాడుతూ వార్డు అధికారులంతా ఫిర్యా దు దారులతో మర్యాదగా మాట్లాడి ఫిర్యాదులను స్వీకరిం చాలన్నారు. కార్యాలయం సమయంలో అందుబాటులో ఉండాలన్నారు. కార్పొరేటర్లు మాట్లాడుతూ అధికార వికేం ద్రికరణలో భాగంగా పౌరుల వద్దకే పరిపాలన తీసుకెళ్ళడం జరుగుతుందన్నారు. పౌరుల సమస్యలను తక్షణమే పరిష్క రించి హైదరాబాద్‌ మహనగరంలో పౌర సదుపా యాలు మెరుగుపరచడం జరుగుతుందన్నారు. వివిధ శాఖలకు చెందిన వార్డు అధికా రులంతా సమన్వయంతో పని చేసి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు ఎం.శ్రీనివాస్‌ రావు, శీరిష, సభిహా బేగం, మహేందర్‌, సతీష్‌ గౌడ్‌, ఎం.నర్సింహ యాదవ్‌, రవీందర్‌ రెడ్డి, జె.సత్యనారాయణ రావు, ఎన్‌.శ్రీని వాస్‌ రావు, ఎస్‌ఈ చిన్న రెడ్డి, ఉప కమిషనర్లు రవికుమా ర్‌, రవీందర్‌ కుమార్‌, ఈఈ గోవర్ధన్‌, డీడీ పద్మనాభం, కె.శ్రీకాంత్‌ రెడ్డి, సొల్మెన్‌ రాజు, అడ్మినిస్ట్రేటివ్‌ అధికారులు, సహయ మున్సిపల్‌ కమిషనర్‌, అసిస్టెంట్‌ ఇంజినీర్లు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Spread the love