సహకార బ్యాంకింగ్ రంగంలో రెండంచెల విధానానికి బీఆర్ఎస్ ప్రభుత్వం సానుకూలం..

– ఈ వ్యవస్థపై మరింత అధ్యయనం చేయాల్సిన అవసరముంది
– రెండంచెల  వ్యవస్థపై ఎఐబిఇఎ లాంటి యూనియన్లు తగిన నివేదిక ఇవ్వాలి
– తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్
నవతెలంగాణ -సుల్తాన్ బజార్ 
 రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా సహకార బ్యాంకింగ్ రంగంలో రెండంచెల విధానం పట్ల బి ఆర్ ఎస్  ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. అయితే ఈ విధానంపై మరింత అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సహకార బ్యాంకింగ్ రంగంలో రెండంచెల విధానాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలనే విషయంపై ఈ రంగంలో పనిచేస్తున్న ఎఐబిఇఎ లాంటి యూనియన్లు  ప్రతిపాదనలతో నివేదిక ఇస్తే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు దృష్టికి తీసుకెళ్ళి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ‘సహకార రంగంలో నిర్మాణాత్మక మార్పులు’ అనే అంశంపై సదస్సు అఖిల భారత బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఎఐబిఇఎ) ఆధ్వర్యంలో ఆదివారం సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో వినోద్ కుమార్ తోపాటు ఎఐబిఇఎ జాతీయ కార్యదర్శి బి.ఎస్. రాంబాబు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (ఎపిటిబిఇఎఫ్) అధ్యక్షులు రవీంద్రనాథ్, ప్రధాన కార్యదర్శి పి.వి.కృష్ణారావు, సహకార బ్యాంకుల ఉద్యోగుల అసోసియేషన్ నాయకుడు సురేందర్ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా బోయినపల్లి వినోద్ కుమార్ ప్రసంగిస్తూ  సహకార ఉద్యమం పుట్టినప్పటి కంటే  ప్రస్తుత సమాజంలోనే  సహకార ఉద్యమం  మరింత ఎక్కువగా అవసరముందని, సహకార ఉద్యమం కంటే ముందు కొద్ది మంది చేతుల్లోనే భూఈ వ్యవస్థపై మరింత అధ్యయనం చేయాల్సిన అవసరముందిమి ఉండేదని, అనేక రకాల ప్రజాఉద్యమాల వల్ల భూ సంస్కరణల అమలు అనంతరం భూమి పంపిణీ జరిగి ప్రస్తుతం చిన్న కమతాల రూపంలో వ్యవసాయ భూమి పెద్దఎత్తున పెరగడమే ఇందుకు కారణమన్నారు. ఆ ఉద్దేశ్యంతోనే బి ఆర్ ఎస్ ప్రభుత్వం రైతు వేదికలను ఏర్పాటు చేసిందని, ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని నియమించిందని, సీజన్ ఎకరానికి రూ.5 వేల పంట పెట్టుబడి సాయం, పంటరుణాలు  రైతులకు ఎంతో ధైర్యాన్ని ఇస్తున్నాయన్నారు.
బ్యాంకింగ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం
ఒక వైపు ప్రైవేటు బ్యాంకులను జాతీయకరణ చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తుంటే మరోవైపు ప్రభుత్వరంగ బ్యాంకింగ్ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని బోయినపల్లి వినోద్ విమర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి దోహదపడే ప్రభుత్వరంగ బ్యాంకింగ్ వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరంపై ప్రజలను చైతన్యవంతం చేయాలని ఆయన బ్యాంకు ఉద్యోగులను కోరారు. మిశ్రమ ఆర్థిక విధానం కలిగిన దేశ ఆర్థిక వ్యవస్థ పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళితే ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కొవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. బి.ఎస్.రాంబాబు మాట్లాడుతూ సహకార బ్యాంకింగ్ రంగంలో మూడంచెల విధానాన్ని తొలగించి డిసిసిబిలను అపెక్స్ బ్యాంకులలో విలీనం చేయడం ద్వారా రెండంచెల విధానాన్ని అమలు చేసేందుకు ఆర్ బిఐ కూడా సానుకూలంగా స్పందించిందన్నారు. ప్రభుత్వ రంగం పట్ల బి ఆర్ ఎస్ ప్రభుత్వం అనుకూలంగా ఉండడం అభినందనీయమన్నారు. జాతీయ పార్టీ అయిన బిజెపి ప్రైవేటీకరణ విధానాలను అనురిస్తుండగా, ప్రాంతీయ పార్టీ అయిన టిఆర్ జాతీయకరణ తన విధానమని నినదించిందని రాంబాబు గుర్తు చేశారు. అలాంటి ప్రభుత్వాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉద్యోగులకు ఎంతైనా ఉందన్నారు. సహకార బ్యాంకింగ్ రంగంలో రెండంచెల విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా రైతులకు రుణాలను 9 శాతంవడ్డీకి బదులుగా 3 శాతానికే ఇవ్వవచ్చని సురేందర్ వివరించారు.
Spread the love