పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించండి: సీపీఐ(ఎం)

– సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎల్. దేశ నాయక్
– సీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా కారల్ మార్క్స  జయంతి
నవతెలంగాణ – అచ్చంపేట 
ఈనెల 13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎల్. దేశ నాయక్ ప్రజలకు ఓటర్లకు పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో సీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా కారల్  మార్క్స  జయంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి డాక్టరు మల్లు రవికి సీపీఐ(ఎం) పార్టీ మద్దతు ఉంటుందని అందుకు సంబంధించిన బుక్ లేటు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎల్. దేశ నాయక్ మాట్లాడారు. నాగర్ కర్నూల్ లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి డాక్టరు మల్లు రవి ని అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.  పది సంవత్సరాల మోడీ పాలనలో నిత్యవసర వస్తువుల ధరలు సామాన్యుడు కొనలేని స్థితికి చేరుకున్నాయి. గత 50 ఏళ్లలో గరిష్ట స్థాయికి నిరుద్యోగం పెరిగిందన్నారు. పెద్ద నోట్ల రద్దుతో లక్షలాదిమందికి  ఉపాధి పోయియారని, ఉపాధి హామీ పథకాన్ని పట్టణాలకు విస్తరించకపోగా , మరింత నీరుగర్చే  విధంగా మోడీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందన్నారు దీనివల్ల గ్రామీణ ప్రాంత నిరుపేద కూలీలు తీవ్ర అవస్థలు పడతారని అన్నారు. దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగాయనీ , రాష్ట్రాల అధికారాలను మోడీ ప్రభుత్వం హరిస్తున్నదనీ,  జీఎస్టీ పేరుతో వనరులన్నీ తన గుప్పెట్లో పెట్టుకున్నదన్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న బీజేపీ ప్రభుత్వం హామీ నీటి మీద రాతలుగా మిగిలిపోయినాయనీ అన్నారు. అందుకే ఈ 18వ లోక్సభ ఎన్నికలలో ఇండియా కూటమి అభ్యర్థి అయిన డాక్టర్ మల్లు రవి కి సిపిఎం పార్టీ మద్దతు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పార్టీ నాయకులు చిన్న అంజనేయ,  బొల్లు చిన్నయ్య , శ్రీను,  గౌరయ్య , మహిళా సంఘం నాయకురాళ్లు నిర్మల, రజిత, శివలీల , జంగయ్య, తదితరులు ఉన్నారు.
Spread the love