బీజేపీ చేసిన అన్యాయాలను ఎండగట్టే కృషిని మరింత ఉధృతం చేయాలి : సీపీఐ(ఎం)

నవతెలంగాణ-హైదరాబాద్ : ఈరోజు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గం సమావేశమైంది. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా రాష్ట్రవ్యాపితంగా బీజేపీ మతోన్మాద శక్తుల ఓటమి కోసం పార్టీ నిర్వహిస్తున్న రాజకీయ ప్రచారం గురించి సమావేశం సమీక్షించింది. దేశానికి, తెలంగాణ రాష్ట్రానికి, ప్రజలకు బీజేపీ చేసిన అన్యాయాలను ఎండగట్టే కృషిని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించింది. ఈ కృషికి తోడ్పడేందుకు, పార్టీ యొక్క స్వతంత్ర రాజకీయ విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకుగాను భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేస్తున్న సీపీఐ(ఎం) అభ్యర్థి మహమ్మద్‌ జహంగీర్‌ను బలపర్చాలని విజ్ఞప్తి చేస్తున్నది. మిగిలిన 16 స్థానాలలో మతోన్మాద బీజేపీని ఓడించేందుకు ఇండియా బ్లాక్‌లో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను బలపర్చాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

Spread the love