నవతెలంగాణ-హైదరాబాద్ : పదిహేడో సీజన్లో రికార్డులు బద్దలు కొడుతున్న సన్రైజర్స్ హైదరాబాద్ కీలక పోరుకు సిద్దమైంది. తొలి విడతలో చెన్నై సూపర్ కింగ్స్ను చిత్తు చేసిన కమిన్స్ సేన చెపాక్లో చెలరేగేందుకు కాచుకొని ఉంది. టాస్ గెలిచిన ప్యాట్ కమిన్స్ బౌలింగ్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్కు హైదరాబాద్ స్పిన్నర్ మయాంక్ మార్కండే దూరమయ్యాడు. మరోవైపు సీఎస్కే ఏ మార్పులు లేకుండా ఆడుతోంది.
సన్రైజర్స్ తుది జట్టు : అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఎడెన్ మర్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), నితీశ్ రెడ్డి, అబ్దుల్ సమద్, షహ్బాజ్ అహ్మద్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనాద్కాట్, టి.నటరాజన్.
సీఎస్కే తుది జట్టు : రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), అజింక్యా రహానే, డారిల్ మిచెల్, మోయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ(వికెట్ కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్పాండే, ముస్తాఫిజుర్, మథీశ పథిరన.