ఉపాధి కూలీలకు రోజు కూలీ రూ.600 చెల్లించాలి

– సీపీఐ(ఎం) భద్రాచలం డివిజన్‌
కో కన్వీనర్‌ పుల్లయ్య
నవతెలంగాణ-దుమ్ముగూడెం
ఉపాధి పనులు చేస్తున్న కూలీలకు కనీస వేతన చట్టం ప్రకారం రోజు కూలీ రూ.600 చెల్లించాలని సీపీఐ(ఎం) భద్రాచలం డివిజన్‌ కో కన్వీనర్‌ కారం పుల్లయ్య డిమాండ్‌ చేశారు. పార్టీ ఆధ్వర్యంలో ఉపాధి పనుల పరీశీలనలో భాగంగా గురువారం నారాయణరావుపేట గ్రామ పంచాయతీ పరిధిలోని గంగవరం గ్రామంలో ఉపాధి పనులు చేస్తున్న కూలీల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉపాది పనులను 200 రోజులు పెంచాలని, పనుల వద్ద కనీస సౌకర్యాలు కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. గత సంవత్సర పని చేసిన కూలీలకు రెండు వారాలకు సంబందించి కూలీ డబ్బులు చెల్లించలేదన్నారు. కూలీల సమస్యలను ఎంపీడీఓ ముత్యారావు దృష్టికి తీసుకువెళ్లారు. స్పం దించిన ఎంపీడీఓ వెంటనూ కూలీ డబ్బులు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు సరియం ప్రసాద్‌, నూప అర్జున్‌, గంగరాజు, వెంకటేశ్వర్లు, వెంకన్నబాబు, మంగమ్మ, రవి, వెంకటమ్మ తదితరులు ఉన్నారు.

Spread the love