దళిత రత్నా అవార్డు గ్రహీతలు

నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
దళితులకు కోసం మరింత కృషి చేస్తాం అని వారు అన్నారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 132 జయంతి ఉత్సవం 2023 సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వము దళితులకు డాక్టర్ బి.ఆర్. అంబెడ్కర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దళిత రత్న అవార్డులను, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా లో ఆరుగురు దళిత నాయకులు, రాష్ట్ర మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడ్ల నాగరాజ్, జిల్లా అధ్యక్షులు ఆనంపల్లి ఎల్లయ్య, మిర్జాపూర్ సాయిలు, రవీంద్రబాబు, బత్తుల కిష్టయ్య, బట్టి గంగాధర్, సమ్మయ్య లకు రాష్ట్ర మంత్రి వర్యులు ఎస్సీ, గిరిజన, బిసీ, మైనారిటీ, వికలాంగుల, వయోజనుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ చేతుల మీదుగా శనివారం దళిత రత్న అవార్డు లను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబెద్కర్ ఆశయ సాధన కోసం, దళితుల సంక్షేమానికి, ఎల్లావెళల దళితులకు సహకారం గా, దళితుల అభివృద్ధికి పాటుపడుతున్నారని మంత్రి వర్యులు నిజామాబాద్ జిల్లా వాసులను గుర్తించి, ప్రశంసించి, అవార్డులు ప్రదానం చేయడం సంతోష దాయకంగా ఉందని వారు అన్నారు. మరింత ఉత్సాహంతో ఇంకా ఎన్నో సహకార కార్యక్రమాలు దళితులకు చేరే విధంగా ఎల్లావెలళా పటుపడుతమని అంబెడ్కర్ ఆశయ సాధనకు మరింత కృషి చేస్తామని అన్నారు.

 

Spread the love